తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ శనివారం (మార్చి 2) ‘టీఎస్ ఎంసెట్ 2019’ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 3, 4, 5 తేదీల్లో ఇంజనీరింగ్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 8, 9న అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష ఉంటుంది. ఎంసెట్ 2019కు మార్చి 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 5.
ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉండగా.. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించేది లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు.. రూ.800
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. రూ.400
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 6 - ఏప్రిల్ 5 వరకు
దరఖాస్తుల ఎడిట్కు అవకాశం: ఏప్రిల్ 6 - 9 వరకు
హాల్ టికెట్ల డౌన్లోడ్: ఏప్రిల్ 20 నుంచి మే 1
ఇంజనీరింగ్ పరీక్ష (ఆన్లైన్): మే 3, 4, 6
అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష (ఆన్లైన్): మే 8, 9
ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉండగా.. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించేది లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు.. రూ.800
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. రూ.400
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 6 - ఏప్రిల్ 5 వరకు
దరఖాస్తుల ఎడిట్కు అవకాశం: ఏప్రిల్ 6 - 9 వరకు
హాల్ టికెట్ల డౌన్లోడ్: ఏప్రిల్ 20 నుంచి మే 1
ఇంజనీరింగ్ పరీక్ష (ఆన్లైన్): మే 3, 4, 6
అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష (ఆన్లైన్): మే 8, 9