తెలంగాణలో వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన 'దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ)' దరఖాస్తు ప్రక్రియ మే 23న ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. షెడ్యూలు ప్రకారం మే 23తో ప్రారంభమయ్యే ప్రవేశ ప్రక్రియ జూన్ 29తో ముగియనుంది. జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. రూ.400 ఆలస్య రుసుముతో జూన్ 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
'దోస్త్' ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..
'దోస్త్' పూర్తి షెడ్యూలు ఇలా..
ప్రత్యేక సహాయక కేంద్రాలు..
'దోస్త్' ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ప్రవేశాల్లో.. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించి సీటు ఖరారు చేసుకునే వెసులుబాటును కల్పించారు. కులం, ఆదాయ ధృవపత్రాలు జతపరిచే విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాష్ట్రంలోని 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్రంలోని పలు కళాశాలలు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా కాకుండా నేరుగా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఆయా కళాశాలలు 'దోస్త్' పరిధిలో ఉండవు. ఆ కళాశాలలకు మినహాయింపు..2019-20 విద్యాసంవత్సరానికి ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటూ ఉన్నత విద్యాశాఖ పత్రికా ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలనడం తెలంగాణ విద్యా సంస్థల (ప్రవేశాలు, క్యాపిటేషన్ ఫీజు నియంత్రణ) చట్టం 1983కు విరుద్ధమని.. వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేయాలని కొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విచారణలో భాగంగా వాదనలు వినిపించిన ఉన్నత విద్యామండలి, దోస్త్ కన్వీనర్ తరఫు న్యాయవాది.. ఇప్పటికే 1200 పైగా కళాశాలలు ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టడానికి అంగీకరించాయని.. కొన్ని కళాశాలలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశాయని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్లు దాఖలు చేసిన కళాశాలలను 'దోస్త్' పరిధి నుంచి మినహాయించాలంటూ స్పష్టం చేసింది.
'దోస్త్' ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..
'దోస్త్' పూర్తి షెడ్యూలు ఇలా..
నోటిఫికేషన్ | 22.05.2019 |
✪ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ | 23.05.2019 - 03.06.2019 |
వెబ్ఆప్షన్ల ప్రక్రియ | 25.05.2019 - 03.06.2019 |
రూ.400 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది - | 04.06.2019 |
స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ : | |
✦ పీహెచ్/క్యాప్ | 01.06.2019 |
✦ ఎన్సీసీ/ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ | 03.06.2019 |
✦ స్పోర్ట్స్ & గేమ్స్ | 04.06.2019 |
మొదటి విడత సీట్ల కేటాయింపు | 10.06.2019 |
ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ (ఆన్లైన్ ఫీజు చెల్లింపు) | 10.06.2019 - 15.06.2019 |
✪ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ (రిజిస్ట్రేషన్ ఫీజు-రూ.400) | 10.06.2019 - 15.06.2019 |
వెబ్ఆప్షన్ల ప్రక్రియ | 10.06.2019 - 15.06.2019 |
స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ | |
✦ పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్- | 15.06.2019 |
రెండో విడత సీట్ల కేటాయింపు | 20.06.2019 |
ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ (ఆన్లైన్ ఫీజు చెల్లింపు) | 20.06.2019 - 25.06.2019 |
✪ మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్ల ప్రక్రియ (రిజిస్ట్రేషన్ ఫీజు-రూ.400) | 20.06.2019 - 25.06.2019 |
స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్: | |
✦ పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ | 25.06.2019 |
మూడో విడత సీట్ల కేటాయింపు | 29.06.2019 |
ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ (ఆన్లైన్ ఫీజు చెల్లింపు) | 01.07.2019 - 04.07.2019 |
సీట్లు పొందినవారు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ | 01.07.2019 - 04.07.2019 |
తరగతులు ప్రారంభం | 01.07.2019 |
అంతర్గత ప్రవేశాలు | 05.07.2019 - 07.07.2019 |
సీట్ల కేటాయింపు | 10.07.2019 |
ప్రత్యేక సహాయక కేంద్రాలు..
'దోస్త్' ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ప్రవేశాల్లో.. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించి సీటు ఖరారు చేసుకునే వెసులుబాటును కల్పించారు. కులం, ఆదాయ ధృవపత్రాలు జతపరిచే విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాష్ట్రంలోని 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్రంలోని పలు కళాశాలలు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా కాకుండా నేరుగా ప్రవేశాలు కల్పించనున్నాయి. ఆయా కళాశాలలు 'దోస్త్' పరిధిలో ఉండవు.