యాప్నగరం

TS PECET Counselling 2022: ఈనెల 19 నుంచి టీఎస్‌ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే

TS PECET 2022: బీపీఈడీ, డీపీఈడీ సీట్ల భర్తీకి టీఎస్‌ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ (TS PECET Counselling) అక్టోబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. బీఈడీ సీట్ల భర్తీకి ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 18 నుంచి ప్రారంభమవుతుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 17 Oct 2022, 12:57 pm
TS PECET Counselling 2022: తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ సీట్ల భర్తీకి ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 18 నుంచి, బీపీఈడీ, డీపీఈడీ సీట్ల భర్తీకి టీఎస్‌ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ (TS PECET Counselling) అక్టోబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి సమక్షంలో జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక రెండు రోజుల వ్యవధితో నవంబరు 14 నుంచి తరగతులు మొదలుపెట్టాలని నిర్ణయించారు.
Samayam Telugu TS PECET Counselling 2022


రాష్ట్రంలోని బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్‌ ఎడ్‌సెట్ ప‌రీక్ష‌ను జూలై 25న నిర్వహించింది. ఈ ఎడ్‌సెట్‌కు 83 శాతం మంది అభ్యర్థులు హాజర‌య్యారు. తెలంగాణ రాష్ట్ర‌వాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో మూడు సెషన్లుగా పరీక్ష జరిగింది. మొత్తం 38,091 మంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 31,578 మంది హాజర‌య్యారు. అయితే విటికి సంబంధించి ఫలితాలను ఆగస్టు నెలలో విడుదల చేశారు. ఫలితాల్లో 96.84శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 30,580 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు పూర్తి వివరాలను http://edcetadm.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

తొలి విడత TS EdCET counselling షెడ్యూల్‌ ఇదే:
  • అక్టోబర్‌ 17న: నోటిఫికేషన్‌ జారీ
  • 18 నుంచి 26: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల సమర్పణ, పరిశీలన
  • 28 నుంచి 30: వెబ్‌ ఆప్షన్లు - నవంబరు 4: సీట్ల కేటాయింపు
  • 5 నుంచి 11వ తేదీ వరకు: ఫీజు చెల్లించి.. కాలేజీల్లో రిపోర్ట్‌ చేయడం

TS PECET Counselling తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే:
  • అక్టోబర్‌ 18వ తేదీ: నోటిఫికేషన్‌ జారీ
  • 19 నుంచి 26: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల అప్‌లోడ్‌, పరిశీలన
  • 29 నుంచి 30: వెబ్‌ ఆప్షన్లు - నవంబరు 2: సీట్ల కేటాయింపు
  • 3 నుంచి 11వ తేదీ వరకు: ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్‌ చేయడం
  • నవంబరు 14న: తరగతులు ప్రారంభం
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.