యాప్నగరం

TS PGECET Counselling 2020: ఈనెల 25 నుంచి పీజీఈసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌

TS PGECET 2020 Counselling: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జనవరి 25 నుంచి ప్రారంభమవుతాయి.

Samayam Telugu 23 Jan 2021, 8:03 pm
ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జ‌న‌వరి 25వ తేదీ నుంచి తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్‌) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌బాబు తెలిపారు. జ‌న‌వ‌రి 25 నుంచి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 8వ తేదీన సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. 12లోపు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.
Samayam Telugu టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్


రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీజీఈసెట్‌) ప‌రీక్ష‌ను గతేడాది సెప్టెంబ‌ర్ 21 నుంచి 24వ‌ర‌కు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల కోసం మొత్తం 22,282 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 16,807 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.