ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో ఉంటాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించిన అనంతరం యథావిధిగా ఇంప్రూవ్మెంట్, ఇన్స్టెంట్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులకు తప్పనిసరిగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని చెప్పారు. 18 నుంచి క్లాసులు ప్రారంభం:
ఇక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 18న తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున పనిదినాలు 160 రోజులకు పరిమితం చేశారు. ఆరో తరగతి విద్యార్థులకు కూడా జనవరి 18 నుంచి తరగతులు మొదలవుతాయి. 1-5వ తరగతుల ప్రారంభంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే ఏడాది ఆన్లైన్లోనే ఇంటర్ ప్రవేశాలు
వచ్చే విద్యా సంవత్సరం(2021-2022) నుంచి ఇంటర్ ప్రవేశాలు తప్పనిసరిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు అమలుచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం జరుగుతుంటాయన్నారు.
విద్యార్థుల వసతిగృహాల నిర్వహణకు అవసరమైతే కొత్త నిబంధనలు తెస్తామని వెల్లడించారు. కొవిడ్ కారణంగా ట్యూషన్ ఫీజులో 70 శాతమే యాజమాన్యాలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకొని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలని.. నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు డీజీపీకి లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 18న తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున పనిదినాలు 160 రోజులకు పరిమితం చేశారు. ఆరో తరగతి విద్యార్థులకు కూడా జనవరి 18 నుంచి తరగతులు మొదలవుతాయి. 1-5వ తరగతుల ప్రారంభంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే ఏడాది ఆన్లైన్లోనే ఇంటర్ ప్రవేశాలు
వచ్చే విద్యా సంవత్సరం(2021-2022) నుంచి ఇంటర్ ప్రవేశాలు తప్పనిసరిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు అమలుచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం జరుగుతుంటాయన్నారు.
విద్యార్థుల వసతిగృహాల నిర్వహణకు అవసరమైతే కొత్త నిబంధనలు తెస్తామని వెల్లడించారు. కొవిడ్ కారణంగా ట్యూషన్ ఫీజులో 70 శాతమే యాజమాన్యాలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకొని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలని.. నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు డీజీపీకి లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.