యాప్నగరం

AP: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. అందరూ పాస్‌..!

ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 20 Jun 2020, 6:20 pm
ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే నెలలో నిర్వహించాలనుకున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu ఇంటర్‌ సప్లిమెంటరీ


అంతేకాదు 2019-2020 విద్యాసంవత్సరంలో ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సప్లిమెంటరీ ఫీజు ఇచ్చిన వారికి వెనక్కి ఇచ్చేస్తామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.

Must read: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

అయితే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ యథాతథంగా జరుగుతాయని.. విద్యార్థులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్‌లో ఫెయిల్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులంతా పాస్‌ అయినట్టు మంత్రి ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.