యాప్నగరం

AP 10th class Exams: టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌.. వెంటనే పరీక్షల ఫీజు చెల్లించండి.. చివరితేదీ ఇదే

AP SSC Exams 2022: ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 16 వరకు పరీక్షల ఫీజును చెల్లించొచ్చు. ఇక రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 30 Jan 2022, 12:12 pm
AP 10th class Exam Fee last date: ఆంద్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2022 ఫీజును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 4వ తేదీలోపు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. నామినల్ రోల్స్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఫిబ్రవరి 4వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది.
Samayam Telugu ఏపీ ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజు


ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 16 వరకు పరీక్షల ఫీజును చెల్లించొచ్చు. ఇక రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుది గడువును ఫిబ్రవరి 14 వరకు బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు పరీక్షల ఫీజు చెల్లించవ్చని తాజాగా తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. మే 20 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులకు సూపర్‌ ఛాన్స్‌.. రూ.25,000 స్టైఫండ్‌ పొందే అవకాశం.. పూర్తి వివరాలివే
AICTE కి చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (IKS) విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐకేఎస్ (IKS)లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి స్టూడెంట్ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం (Student internship programme)ను తాజాగా లాంచ్ చేసింది. కొత్త ఐకేఎస్ కేంద్రాలకు ప్రపోజల్స్‌తో పాటు, పోటీ పరిశోధన ప్రపోజల్స్ కూడా లాంచ్ చేసింది.

ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఆయా రంగంలో విస్తారమైన అనుభవాన్ని కలిగి ఉన్న ఐకేఎస్ నిపుణుల సహాయంతో తమ జ్ఞానం పెంచుకుంటారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. ఈ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంకు సెలెక్ట్ అయిన ప్రతి ఇంటర్న్‌ సుమారు రూ. 25,000 స్టైఫండ్‌ అందుకుంటారు. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు https://iksindia.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వాళ్లు ఇంటర్నేషనల్ షార్ట్ రీసెర్చ్ ప్రాజెక్టులు, యాక్టివిటీస్/వర్క్‌షాప్‌లు మొదలైన వాటిపై పనిచేయాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ పథకం కింద సెంటర్ స్థాపించడానికి, సంబంధిత యాక్టివిటీస్‌లు నిర్వహించడానికి సంస్థకు రెండేళ్లలో రూ. 30-40 లక్షల నిధుల మద్దతును ఐకేఎస్ విభాగం అందజేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.