యాప్నగరం

ap 10th exams 2020: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీలో పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 20 Jun 2020, 5:54 pm
ఆంధ్రప్రదేశ్‌లో పదో తగరతి పరీక్షల నిర్వహణపై వెలువడుతున్న ఊహాగాలకు తెరపడింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు
Samayam Telugu ఏపీ పది పరీక్షలు


విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ వెల్లడించారు. పరీక్షల జాగ్రత్తగా నిర్వహించాలని పక్కా ప్రణాళిక చేశామని, ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెప్పించామని, పేపర్లను తగ్గించామని, పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Must read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎంసెట్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ మార్చుకోవచ్చు!

మ‌రోవైపు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో స‌హా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్నల్‌ మార్కులు, ఇతర ప‌రీక్షల్లో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం, హాజ‌రు ఆధారంగా ఫలితాలు కేటాయించాలని నిర్ణయించాయి.

ప్రస్తుతం ఏపీలో ప్రతిక్షాలతో పాటు విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఇదే త‌ర‌హా విధానం అమ‌లు చేయాల‌ని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో అధికారులు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయంపై ఉత్కంఠకు ఫుల్‌స్టాఫ్‌ పడింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,30,804 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

Must read: గురుకుల స్కూళ్లకు ప్రవేశ పరీక్ష రద్దు.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.