యాప్నగరం

టీఎస్‌: ఐదు విభాగాలుగా ఎంసెట్‌ పరీక్షలు.. ఈ నెల 22 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..?

టీఎస్‌ ఎంసెట్‌ 2020 పరీక్షలు జులై 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Samayam Telugu 11 Jun 2020, 4:23 pm
తెలంగాణలో జులై 6 నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను ఎలా నిర్వహించాలనే అంశంపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు.
Samayam Telugu టీఎస్‌ ఎంసెట్‌ 2020


ఐదు విభాగాలుగా:
ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష జులై 6, 7 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం ఉంటుంది. అలాగే మళ్లీ 8వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. ఇక అగ్రికల్చర్‌ పరీక్షను జులై 8వ తేదీ మధ్యాహ్నం, 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

జులై 8న సీబీఎస్‌ఈ విద్యార్థులకు:
జులై 7వ తేదీన సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు మిగిలిపోయిన పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. అదే రోజు ఎంసెట్‌ పరీక్ష కూడా ఉన్నందున సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా జులై 8వ తేదీన పరీక్ష రాసేలా అవకాశం ఇస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 1800 మంది సీబీఎస్‌ఈ విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Also read: శిక్షణ ఇచ్చారు పోస్టింగ్‌ ఇవ్వలేదు.. 259 మంది గ్రూప్‌-2 అభ్యర్థుల విషాద గాథ..!

మొత్తం దరఖాస్తులు 2,19,410
ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌కు మొత్తం కలిపి 2,19,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి రెండు వేలకుపైగా దరఖాస్తులు పెరిగినట్లు తెలుస్తోంది. ఎంసెట్‌ దరఖాస్తు గడువు జూన్ 10తో ముగిసింది. కానీ రూ.10,000 ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అలాగే విద్యార్థులు దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే జూన్‌ 11 నుంచి 16 వరకు సవరించుకునే అవకాశం కల్పించారు. ఇక జూన్‌ 22 నుంచి జులై 3 వరకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.