యాప్నగరం

ఈ నెల్లోనే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

వీలయినంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది.

Samayam Telugu 12 Jun 2020, 8:31 pm
ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెలలోనే వీలయినంత త్వరగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ తెలిపారు.
Samayam Telugu టీఎస్‌ ఇంటర్ ఫలితాలు


గత నెల 12 నుంచి 30 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని.. జవాబు పత్రాల స్కానింగ్‌, మార్కుల అప్‌లోడ్‌, తుది పరిశీలన, మెమోల రూపకల్పన తదితర ప్రక్రియలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

ఇప్పటికే ప్రకటించాల్సిన ఇంటర్ ఫలితాలు కూడా ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ సడలించడంతో అతి త్వరలో ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది.

అయితే ఫలితాల విషయంలో గతేడాది జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఫలితాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.