యాప్నగరం

టీఎస్‌: ఇంటర్ ఫలితాలపై నేడు స్పష్టత..?

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు సంబంధించిన తేదీలపై ఈ రోజు స్పష్టత రానుంది.

Samayam Telugu 15 Jun 2020, 11:24 am
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నేడు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు సమావేశమై తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu టీఎస్‌ ఇంటర్‌ ఫలితాలు


అన్నీ అనుకున్నట్లు జరిగితే 16 లేదా 17న ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. గతేడాది జరిగిన అనుభవాల ద`ష్ట్యా ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరీశీలిస్తున్నారు.

అలాగే ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని చూస్తుండటంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు మంగళవారం విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

16న సాధ్యం కాకపోతే బుధవారం (17వ తేదీన) విడుదల చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.