యాప్నగరం

TS Inter Supply Hall Ticket 2022: తెలంగాణ ఇంటర్‌ 1st Year, 2nd Year సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. లింక్‌ ఇదే

TS Inter Supplementary Exams 2022: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 25 Jul 2022, 6:07 pm
TS Inter Supply Hall Ticket 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక.. ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Samayam Telugu TS Inter Supply Hall Ticket 2022


మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష తేదీల కోసం క్లిక్‌ చేయండి.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

TS EAMCET Answer Key 2022: ముగిసిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు.. అధికారిక ఆన్సర్‌ కీ విడుదల
తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఎగ్జామ్ బుధవారం (జులై 20)తో ముగిసింది. ఈ నెల 18న ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల్లో నిత్యం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన అధికారిక ఆన్సర్‌కీ (TS EAMCET Answer Key), రెస్పాన్స్‌ షీట్లు కూడా విడుదలయ్యాయి.

ఇదిలా ఉంటే.. అగ్రికల్చర్ సీట్లకు సంబంధించిన ఎంసెట్ పరీక్షలు ఇంకా నిర్వహించలేదు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ.. భారీ వర్షాల నేపథ్యంలో ఈ పరీక్షలను ఈ నెల 30, 31 తేదీలకు వాయిదా వేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అగ్రికల్చర్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఫలితాలకు సంబంధించిన కసరత్తు మొదలు కానుంది. వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముత్తం పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఆగస్టు 8వ తేదీలోగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఆలస్యమైనా.. 10వ తేదీలోగా ఫలితాలను విడుదల చేయనున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.