యాప్నగరం

TS polycet 2020: దరఖాస్తు గడువు పొడిగింపు..చివరితేదీ ఎప్పుడంటే..!

తెలంగాణలో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ యస్‌. సుధీర్ కుమార్‌ తెలిపారు.

Samayam Telugu 30 May 2020, 7:39 pm
తెలంగాణలో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా జూన్‌ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆలస్య రుసుముతో 12 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
Samayam Telugu SBTET


2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రి కల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా మాత్రమే జరుపుతామన్నారు.

వివిధ వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత, వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పారు. వర్సిటీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలన్నారు.

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెండేళ్ల అగ్రికల్చర్‌ డిప్లొమా, మూడేళ్ల అగ్రికల్చర్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ కోర్సులకు ఇక నుంచి పదో తరగతి మార్కులు లేదా గ్రేడ్లు కాకుండా పాలిసెట్‌ ర్యాంకును ప్రామాణికంగా తీసుకోనున్నారు.

వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21)ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాష్ట్ర విద్యాసాంకేతిక, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) ఆధ్వర్యంలో నిర్వహించే పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్‌) ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు https://www.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.