TS SSC Exams 2023 : తెలంగాణ టెన్త్ పరీక్షలపై టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు (Telangana Tenth Exams) ఎప్పుడు ఉంటాయనే అంశంపై క్లారిటీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది (2023) మార్చిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సాధారణంగా టెన్త్ ఎగ్జామ్స్ లో మొత్తం 11 పేపర్లు ఉంటాయి. హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు 2 పేపర్ల చొప్పున ఉంటాయి.
అయితే.. ఈ సారి ప్రతీ సబ్జెక్టుకు ఒకటి చొప్పున మొత్తం 6 పేపర్లతో పరీక్ష ఉంటుందని ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది వర్షాలు తదితర కారణాలతో సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఇంకా.. విద్యార్థులకు బుక్స్ సైతం ఆలస్యంగా అందించారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ.. ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. మార్చి చివరి వారంలోనే ఎగ్జామ్స్ ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.
పరీక్షల ఫీజుల విషాయానికి వస్తే.. విద్యార్థులు వారు చదివే స్కూల్స్ లోనే హెడ్ మాస్టర్లకు రూ.125 లను పరీక్ష ఫీజు కోసం చెల్లించాలి. అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు చెల్లించిన వారికి మాత్రమే ఈ రూ.125 ఫీజు ఉంటుంది. నవంబర్ 15 తర్వాత ఫీజు చెల్లించిన వారు లేట్ ఫీజుతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.
గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు రూ.60 చెల్లించాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మొదటిసారి పరీక్షకు హాజరయ్యే వారు కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపుంటే వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది.
అయితే.. ఈ సారి ప్రతీ సబ్జెక్టుకు ఒకటి చొప్పున మొత్తం 6 పేపర్లతో పరీక్ష ఉంటుందని ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది వర్షాలు తదితర కారణాలతో సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఇంకా.. విద్యార్థులకు బుక్స్ సైతం ఆలస్యంగా అందించారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ.. ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. మార్చి చివరి వారంలోనే ఎగ్జామ్స్ ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.
పరీక్షల ఫీజుల విషాయానికి వస్తే.. విద్యార్థులు వారు చదివే స్కూల్స్ లోనే హెడ్ మాస్టర్లకు రూ.125 లను పరీక్ష ఫీజు కోసం చెల్లించాలి. అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు చెల్లించిన వారికి మాత్రమే ఈ రూ.125 ఫీజు ఉంటుంది. నవంబర్ 15 తర్వాత ఫీజు చెల్లించిన వారు లేట్ ఫీజుతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.
గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు రూ.60 చెల్లించాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మొదటిసారి పరీక్షకు హాజరయ్యే వారు కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపుంటే వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది.