యాప్నగరం

Telangana SSC Exams: 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఈ ఇయర్‌ నుంచే అమలు

TS 10th Exams: తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన బుధవారం (నవంబర్ 2) జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 3 Nov 2022, 7:05 am
Telangana SSC Exams: 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఇకపై 6 పేపర్లతోనే నిర్వహించనున్నారు. 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన బుధవారం (నవంబర్ 2) జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu Telangana SSC Exams


ఈ విద్యా సంవత్సరం నుంచే 6 పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రెండు దశాబ్దాలుగా పదో తరగతి పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కొవిడ్ పరిస్థితుల కారణంగా బోధన పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఇదే పద్ధతిని కొనసాగించాలని పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. 11 పేపర్లు రాయాల్సి రావడం వల్ల టెన్త్ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖకు SCERT (తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ) కీలక ప్రతిపాదన చేసింది. 11 పేపర్లు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. ఆరు పేపర్లకు కుదించాలని సూచించింది.

ఎస్‌సీఈఆర్‌టీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తెలంగాణ విద్యా శాఖ 6 పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాన్య శాస్త్రం పరీక్షలో మాత్రం భౌతిక శాస్త్రం (Physics), జీవశాస్త్రాలకు (Biology) వేర్వేరు సమాధాన పత్రాలు (Answer sheets) ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం రెండేసి పేపర్లుగా ఉండేవి. సెకండ్ లాంగ్వేజ్ (ఎక్కువ మంది విద్యార్థులు హిందీని ఎంచుకుంటారు) మాత్రం ఒకటే పేపర్ ఉండేది. ఈ మొత్తం కలిపి 11 పేపర్లు రాయాల్సి వచ్చేది. ఇప్పుడు వీటిని సబ్జెక్టుకు ఒకటి చొప్పున 6 పేపర్లకు కుదించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.