యాప్నగరం

SSC Exams: మే 17 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు..! పూర్తి వివరాలివే

Telangana SSC Exams Dates: కోవిడ్ కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది.

Samayam Telugu 22 Jan 2021, 7:54 am
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌. ఈ ఏడాది మే 17 నుంచి 26 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. కోవిడ్ కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది.
Samayam Telugu ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 2021


ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్‌ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను తెలంగాణ సర్కార్‌ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

SCCL: సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
మిగిలిన వారిని ప్రమోట్‌ చేసే అవకాశం..?అయితే అకడమిక్‌ షెడ్యూల్‌లో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తా వించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్‌లైన్‌/ డిజిటల్‌ విధానంలోనే బోధనను కొనసాగించి.. విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.