తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు..!
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ సెకండియర్కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
Samayam Telugu 9 Jun 2021, 11:38 am
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ సెకండియర్కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు
కేటాయించనున్నారు. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసిన విషయం విదితమే.
జూన్ మొదటివారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాక్లాగ్ ఉన్న సెకండియర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వనుంది.
కేటాయించనున్నారు. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసిన విషయం విదితమే.
జూన్ మొదటివారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాక్లాగ్ ఉన్న సెకండియర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వనుంది.