త్వరలో ఎంసెట్ రాయబోయే అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గుడ్న్యూస్ చెప్పారు. ఎంసెట్ పరీక్షలో భాగంగా.. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన తాజాగా ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్ను నిర్వహిస్తుందని తెలిపారు.
ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మరుసటి రోజున వెల్లడిస్తారు. ఫలితాల విడుదలతో పాటు విద్యార్థులు ఏయే అంశాల్లో వీక్గా ఉన్నారో.. ఏయే అంశాల్లో అభ్యర్థులు ఎక్కువ కృషి చేయాలో గైడెన్స్ ఇవ్వనున్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఎంసెట్ మాక్ పరీక్ష రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు www.csihyderabad.org/eamcet లేదా https://eamcet.xplore.co.in/ వెబ్సైట్లలో ఈ నెల 18వ తేదీ లోగా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పై వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి.
Also read: యూజీ, పీజీ పరీక్షలపై స్పష్టత.. పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన తాజాగా ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్ను నిర్వహిస్తుందని తెలిపారు.
ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మరుసటి రోజున వెల్లడిస్తారు. ఫలితాల విడుదలతో పాటు విద్యార్థులు ఏయే అంశాల్లో వీక్గా ఉన్నారో.. ఏయే అంశాల్లో అభ్యర్థులు ఎక్కువ కృషి చేయాలో గైడెన్స్ ఇవ్వనున్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఎంసెట్ మాక్ పరీక్ష రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు www.csihyderabad.org/eamcet లేదా https://eamcet.xplore.co.in/ వెబ్సైట్లలో ఈ నెల 18వ తేదీ లోగా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పై వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి.
Also read: యూజీ, పీజీ పరీక్షలపై స్పష్టత.. పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్