ఆంధ్రప్రదేశ్లో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్) షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష.. సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్టీయూకు అప్పగించారు. మొత్తం 16 సెషన్లలో.. 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజినీరింగ్.. 83,051 మంది అగ్రికల్చర్ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండింటినీ ఎంపిక చేసుకున్నారు. అలాగే.. కరోనా పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పూర్తి వివరాలు https://sche.ap.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
ఇంటర్ మార్కులకు వెయిటేజీ రద్దు:
గతంలో ఏపీఎంసెట్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉంది. కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించడంతో ఈ ఏడాది ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దుచేసినట్లు ఉన్నత విద్యామండలి ఇంతకుముందే ప్రకటించింది.
ఏపీఈఏపీసెట్లో విద్యార్థులు సాధించిన మార్కులనే వందశాతం వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు ఆగస్టు 25న, అగ్రి, ఫార్మా స్ట్రీమ్ పరీక్షకు సెప్టెంబర్ 7న ప్రాథమిక కీలను విడుదల చేయనున్నారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్ కీని విడుదల చేస్తారు. కంప్యూటర్ ఆధారంగా బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సాధారణీకరణ ప్రక్రియననుసరించి ర్యాంకులు ప్రకటిస్తారు.
కోవిడ్ బాధిత విద్యార్థులకు వేరుగా పరీక్ష: మంత్రి సురేష్కోవిడ్ పాజిటివ్ లక్షణాలుండి బాధపడుతున్న విద్యార్థులను ఈ పరీక్షలకు అనుమతించడం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇతర విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి ఈఏపీసెట్ను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. 1000 ఇన్విజిలేటర్లు, 200 మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.
ఇంటర్ మార్కులకు వెయిటేజీ రద్దు:
గతంలో ఏపీఎంసెట్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉంది. కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించడంతో ఈ ఏడాది ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దుచేసినట్లు ఉన్నత విద్యామండలి ఇంతకుముందే ప్రకటించింది.
ఏపీఈఏపీసెట్లో విద్యార్థులు సాధించిన మార్కులనే వందశాతం వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు ఆగస్టు 25న, అగ్రి, ఫార్మా స్ట్రీమ్ పరీక్షకు సెప్టెంబర్ 7న ప్రాథమిక కీలను విడుదల చేయనున్నారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్ కీని విడుదల చేస్తారు. కంప్యూటర్ ఆధారంగా బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సాధారణీకరణ ప్రక్రియననుసరించి ర్యాంకులు ప్రకటిస్తారు.
కోవిడ్ బాధిత విద్యార్థులకు వేరుగా పరీక్ష: మంత్రి సురేష్కోవిడ్ పాజిటివ్ లక్షణాలుండి బాధపడుతున్న విద్యార్థులను ఈ పరీక్షలకు అనుమతించడం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇతర విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి ఈఏపీసెట్ను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. 1000 ఇన్విజిలేటర్లు, 200 మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.