యాప్నగరం

AP Eamcet 2020: ఎంసెట్‌ నిర్వహణపై నేడు స్పష్టత..!

ఎంసెట్‌ 2020 పరీక్షకు సంబంధించిన సందిగ్ధతకు నేడు తెరపడే అవకాశం ఉంది.

Samayam Telugu 13 Jul 2020, 9:53 am
ఏపీలో ఎంసెట్ 2020 పరీక్ష నిర్వహణకు సంబంధించి నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu ఎంసెట్‌ 2020


అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. శనివారం వివిధ ఉమ్మడి పరీక్షల కన్వీనర్లతో భేటి అయిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇవాళ మరోసారి సమావేశం నిర్వహించనున్నారు.

దీంతో ఈరోజు ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మంత్రి కన్వీనర్లతో చర్చించనున్నారు.

ఏపీ ఎంసెట్‌కు సుమారు 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక కాలేజీలు, విద్యాసంస్థలు మూసి ఉండటంతో చాలామంది విద్యార్ధులు స్వస్థలాలకు వెళ్ళిపోయారు. వారందరూ కూడా సొంత జిల్లాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకున్నారు.

అటు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలుగా ఉన్న 23 కాలేజీలు ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లుగా ఉన్నాయి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Also read: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఒకే పరీక్ష.. 75 శాతం మార్కుల నిబంధన రద్దు యోచన..?

Also read: ఇంటర్‌ విద్యలో మార్పులు.. పోటీ పరీక్షలే లక్ష్యంగా యూనిట్‌ టెస్టులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.