యాప్నగరం

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి వివరాలివే

JEE Main Results 2022: ఐఐటీ‌ల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఎంతో కీలకం. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 2 Aug 2022, 6:17 pm
JEE Advanced 2022: ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐఐటీ‌ల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఎంతో కీలకం. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
Samayam Telugu JEE Advanced 2022


ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ (JEE Main Results) ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక.. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఎగ్జామ్‌ను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. రెండూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పేపర్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు.. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

AP ECET Results 2022: ఆగస్టు 6న ఏపీ ఈసెట్‌ ఫలితాలు.. ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే
జేఎన్‌టీయూ - కాకినాడ (JNTUK) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ప్రవేశ పరీక్ష సజావుగా జరిగిందని కన్వీనర్‌ ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. ఉదయం 18,318 మంది విద్యార్థులకు గాను 17,180 మంది హాజరుకాగా.. మధ్యాహ్నం 20,423 మందికిగాను 19,238 మంది పరీక్ష రాశారని చెప్పారు. మొత్తంగా 94 శాతం హాజరు నమోదైందన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని జులై 24న విడుదల చేశారు. అభ్యంతరాలను 26వ తేదీ వరకు స్వీకరించారు. ఇక.. ఫలితాలు ఆగస్టు 6న ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

AP ICET Results 2022: ఆగస్టు 8న ఏపీ ఐసెట్‌ ఫలితాలు:రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఐసెట్‌(AP ICET)-2022 ఫలితాలు ఆగస్టు 8వ తేదీన విడుదలకానున్నాయి. జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో, ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏపీ ఐసెట్‌ 2022 నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించి ఆన్సర్‌ కీ కూడా విడుదలైంది. ఇక.. ఆగస్టు 8న AP ICET Results ప్రకటిస్తారు. కాగా ఏపీ ఐసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీ ఏడాది కల్పిస్తున్నారు. ఇక ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.