యాప్నగరం

జేఈఈ, నీట్‌ పరీక్షలపై సోషల్‌ వార్‌ మొదలు.. RIP NTA అంటూ ఆందోళన

జేఈఈ, నీట్‌ పరీక్షలపై సోషల్‌ మీడియాలో విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. దీనిపై హెచ్‌ఆర్‌డీ మంత్రి స్పందించారు.

Samayam Telugu 2 Jul 2020, 5:29 pm
ఈ నెలలో జరగాల్సి ఉన్న జేఈఈ , నీట్ 2020 పరీక్షల నిర్వహణకు సంబంధించి రెండు రోజుల్లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ట్విట్టర్‌ ద్వారా డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పందించారు.
Samayam Telugu జేఈఈ నీట్‌ 2020


పరిస్థితిని సమీక్షించి, సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్‌టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు.

జేఈఈ పరీక్ష జూలై 19-23 మధ్య జరగాల్సి ఉండగా, నీట్ పరీక్ష జూలై 26 న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు.

Must read: 180 రోజులు స్కూళ్లు.. సిలబస్‌ తగ్గింపు.. సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ మార్పు..?

దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్‌లో #RIP NTA అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. 24 గంటల్లో
3 లక్షలకు పైగా దీనిని రీట్వీట్ చేశారు. దీంతో ఇది టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో చేరింది. దీనిపై హెచ్‌ఆర్‌డీ మంత్రి స్పందించారు.

మీ సమస్యలను నేను అర్థం చేసుకున్నాను, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మేము ప్రయత్నిస్తున్నాం అంటూ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ సమాధానమిచ్చారు.

Must read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.