యాప్నగరం

JEE main 2020 అభ్యర్థుల విషయంలో ఎన్‌టీఏ కీలక నిర్ణయం

జేఈఈ మెయిన్‌ నిర్వహణకు కోవిడ్‌ నేపథ్యంలో ఈ సారి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Samayam Telugu 21 Aug 2020, 3:02 pm
దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జరగనున్న జేఈఈ మెయిన్‌ నిర్వహణకు కోవిడ్‌ నేపథ్యంలో ఈ సారి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్‌కు హాజరవుతున్న అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రత 99.4 డిగ్రీలు దాటితే ఐసొలేషన్‌ గదిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Samayam Telugu జేఈఈ మెయిన్‌ 2020


కరోనా కారణంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రతి ఒక్క అభ్యర్థికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. మొదటిసారి ఉష్ణోగ్రత 99.4 డిగ్రీలు దాటితే వారిని కొద్దిసేపు పక్కన ఉంచి... మళ్లీ ఉష్ణోగ్రత చూస్తారు. అప్పటికీ వారి పరిస్థితి అదేవిధంగా ఉంటే ఐసొలేషన్‌ కేంద్రంలో పరీక్ష రాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఒక ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. అభ్యర్థుల వద్ద ఏమైనా జెరాక్స్‌ కాపీలు ఉన్నాయా? అనుమతి లేని వస్తువులను తీసుకొస్తున్నారా? అని తనిఖీ చేసేందుకు ఈ సారి మెటల్‌ డిటెక్టర్లను వినియోగిస్తారు. దేశవ్యాప్తంగా 224, ఇతర దేశాల్లోని మరో 8 నగరాల్లో పరీక్ష జరగనుంది.

Also read: JEE MAIN 2020 అడ్మిట్ కార్డులు విడుదల.. ఈ వెబ్‌సైటన్‌ నుంచి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..!


భారీగా తగ్గిన దరఖాస్తులు:
ఈ ఏడాది జేఈఈ మెయిన్‌-2కు దరఖాస్తులు భారీగా తగ్గాయి. గత జనవరిలో జరిగిన మెయిన్‌-1తో పోల్చుకుంటే బీఈ/బీటెక్‌ సీట్లకు పోటీపడే వారి సంఖ్య 1.75 లక్షలు తగ్గింది. మొత్తం దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నా పోటీ పడే వారి సంఖ్య దాదాపు 2.60 లక్షలు తగ్గింది. దరఖాస్తుల వివరాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది.

ప్రతి ఏటా జేఈఈ మెయిన్‌ను రెండుసార్లు నిర్వహించి అందులో ఏది ఎక్కువ స్కోర్‌ ఉంటే దాన్ని తీసుకొని ర్యాంకు కేటాయిస్తున్నారు. బీఆర్క్‌/బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి, తాజాగా ప్రయాణం చేసిన వివరాలు తదితరాలను నింపి ఇన్విజిలేటర్‌ సమక్షంలో సంతకం చేసి అందజేయాలి.

Also read: NEET 2020 సబ్జెక్టుల వారీ ప్రిపరేషన్ టిప్స్..!undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.