యాప్నగరం

JEE Main 2022: ఈ ఏడాది రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్స్‌.. అలాగే

JEE Main 2022 Exam Dates: ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఇందుకు తగిన విధంగా జేఈఈ మెయిన్ 2022 షెడ్యూల్ విడుదలైంది.

Samayam Telugu 3 Mar 2022, 8:56 am
JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022 షెడ్యూల్ విడుదలైంది. జాతీయ పరీక్ష మండలి (NTA) ఈ షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల‌ను నిర్వ‌హిస్తారు. ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది.
Samayam Telugu జేఈఈ మెయిన్స్‌ 2022


ఏప్రిల్ 16, 2022 నుంచి ఏప్రిల్ 21, 2022 వరకు మొదటి సెషన్‌, మే 24, 2022 నుంచి మే 29, 2022 వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులు మార్చి 1, 2022 తేదీ నుంచి మార్చి 31, 2022 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.

AP 10Th Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడే ఛాన్స్‌.. ఎందుకంటే..?
13 భాషల్లో పరీక్ష.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు:
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల‌ను నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 2020, 2021లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలుంది. అంతే కాకుండా ఐఐటీల్లో బీటెక్‌ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్ ఇటీవ‌లే విడుదలైంది.

జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూన్‌ 8 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని.. జూలై 18న ఫలితాలను ప్రకటిస్తామని.. మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ మొదలవుతుందని ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.