యాప్నగరం

JEE Main Admit Card 2023 : జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు విడుదల.. లింక్‌ ఇదే

JEE Mains Admit Card 2023 : ఏప్రిల్‌ 6 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ (JEE Main 2023) సెషన్‌ -2 పరీక్షలకు అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 4 Apr 2023, 6:03 pm
JEE Main 2023 Session 2 admit card : దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2023) సెషన్‌ -2కు సంబంధించి అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 6 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ (JEE Main 2023) సెషన్‌ -2 పరీక్షలకు అడ్మిట్‌ కార్డుల్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు https://nta.ac.in/, https://jeemain.nta.nic.in/ అధికారిక వెబ్‌సైట్ల నుంచి తమ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Samayam Telugu JEE Main 2023 Session 2 admit card


అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డును పొందొచ్చు. ఒకవేళ విద్యార్థులు జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) అడ్మిట్‌కార్డును పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు NTA హెల్ప్‌లైన్‌ నంబర్‌ 011-40759000 నంబర్‌ను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చు.

దేశవ్యాప్తంగా 330 నగరాల్లో ఏప్రిల్‌ 6,8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అలాగే.. విదేశాల్లోని 15 నగరాల్లోనూ ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 9.4లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. మరోవైపు.. జేఈఈ మెయిన్‌లో అర్హత మార్కులు సాధించే 2,50,000 మంది విద్యార్థులు జూన్‌ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.