యాప్నగరం

NEET Answer Key 2022: రేపే నీట్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..?

neet.nta.nic.in Answer Key 2022: నీట్‌ పరీక్ష జులై 17న ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. NEET UG 2022 పరీక్షకు ఈ సారి 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా ఈఏడాది 18.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 13 Aug 2022, 7:51 pm
NEET Answer Key 2022: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్‌ పరీక్ష జులై 17న ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. NEET UG 2022 పరీక్షకు ఈ సారి 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా ఈఏడాది 18.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Samayam Telugu NEET Answer Key 2022


తాజా సమాచారం ప్రకారం.. NEET 2022 Result ఆగస్టు 18న.. NEET 2022 Answer Key ఆగస్టు 14న విడుదల కానున్నట్లు సమాచారం. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

125-130 మధ్యలో కటాఫ్‌ మార్క్‌:
గత ఏడాది 480కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. ఈ ఏడాది 450పైగా మార్కులు సాధిస్తే సీటు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లలో పేపరు కొంచెం సులువుగా ఉండటం వల్ల మొత్తం 720 మార్కుల్లో.. 700 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు ఎక్కువమంది ఉన్నారు.

ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉండడంతో.. అన్ని మార్కులొచ్చేవారు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతేడాది (2021)లో కటాఫ్‌ మార్కు జనరల్‌లో 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్‌ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.