యాప్నగరం

NEET PG 2021: నీట్‌ పీజీ పరీక్ష వాయిదా.. త్వరలో కొత్త తేదీ వెల్లడి

యువ వైద్యుల శ్రేయస్సును కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కరోనా పరిస్థితులను బట్టి త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని కూడా పేర్కొన్నారు.

Samayam Telugu 15 Apr 2021, 8:09 pm

ప్రధానాంశాలు:

  • నీట్‌ పీజీ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా
  • త్వరలో కొత్త తేదీలు వెల్లడి
  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నీట్‌ పీజీ 2021 పరీక్ష
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా వాయిదా వేయాలని అన్ని చోట్ల వినిపిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే నీట్‌ పీజీ పరీక్షపై గురువారం (ఏప్రిల్‌ 15) కేంద్రం స్పష్టత ఇచ్చింది.
ఎట్టకేలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. యువ వైద్యుల శ్రేయస్సును కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కరోనా పరిస్థితులను బట్టి త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని కూడా పేర్కొన్నారు.

ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈ పరీక్షను ఏప్రిల్‌ 18న పరీక్ష నిర్వహిస్తామని.. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదంటూ ఇటీవల స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మికార్డులను కూడా ఎన్‌బీఈ (National Board of Examinations) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://nbe.edu.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.