TS EAMCET 2022: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షతేదీలు విడుదలయ్యాయి. వాస్తవానికి ఈనెల 13,14,15వ తేదీల్లో జరగాల్సిన TS EAMCET అగ్రికల్చర్, ఈసెట్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ఈనెల 30,31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అలాగే.. ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అభ్యర్థులు తమ తమ హాల్ టికెట్లను ఆయా వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
NEET 2022: ఈ సారి బాగా ఇబ్బందిపెట్టిన బయాలజీ, కెమిస్ట్రీ.. తేలిగ్గా ఫిజిక్స్ ప్రశ్నలు.. నీట్ 2022 పరీక్షపై నిపుణుల విశ్లేషణ ఇదే
NEET 2022 Answer Key: దేశవ్యాప్తంగా.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. NEET UG 2022 పరీక్షకు ఈ సారి 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా ఈఏడాది 18.72 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. రికార్డ్ స్థాయిలో 95 శాతం హాజరైనట్లు సమాచారం. అలాగే.. NEET 2022 Answer Key అధికారిక ఆన్సర్కీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక.. ప్రశ్నపత్రం విషయానికొస్తే.. గడచిన రెండేళ్లతో పోలిస్తే ఈసారి నీట్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా వచ్చినట్లు విద్యార్థులు, నిపుణులు చెబుతున్నారు. ప్రతీసారీ ఫిజిక్స్ కఠినంగా ఉంటే.. ఈ ఏడాది బయాలజీ, కెమిస్ట్రీలో టఫ్ క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు. ఈసారి ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయంటున్నారు.
వాస్తవానికి బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయని.. ఈసారి మాత్రం వీటిలో లాజికల్ క్వశ్చన్స్ ఇచ్చారని నిపుణులు వెల్లడించారు. అలాగే కొత్త మోడల్ ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. దీంతోపాటు గతంలో లేని విధంగా మ్యాచింగ్ టైప్ ప్రశ్నలతోపాటు స్టేట్మెంట్ - రీజన్ ప్రశ్నలను ఇచ్చినట్లు వెల్లడించారు. దాదాపు 10-12 ప్రశ్నలు కొత్త మోడల్లో ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు. బయాలజీలో ప్రశ్నలు చాలా పెద్దగా ఉన్నట్లు విద్యార్ధులు పేర్కొన్నారు. దానివల్ల సమయం సరిపోలేదని వాపోయారు.
125-130 మధ్యలో కటాఫ్ మార్క్:
గత ఏడాది 480కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈ ఏడాది 450పైగా మార్కులు సాధిస్తే సీటు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లలో పేపరు కొంచెం సులువుగా ఉండటం వల్ల మొత్తం 720 మార్కుల్లో.. 700 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు ఎక్కువమంది ఉన్నారు.
ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉండడంతో.. అన్ని మార్కులొచ్చేవారు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతేడాది(2021)లో కటాఫ్ మార్కు జనరల్లో 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 30,31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అలాగే.. ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అభ్యర్థులు తమ తమ హాల్ టికెట్లను ఆయా వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
NEET 2022: ఈ సారి బాగా ఇబ్బందిపెట్టిన బయాలజీ, కెమిస్ట్రీ.. తేలిగ్గా ఫిజిక్స్ ప్రశ్నలు.. నీట్ 2022 పరీక్షపై నిపుణుల విశ్లేషణ ఇదే
NEET 2022 Answer Key: దేశవ్యాప్తంగా.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. NEET UG 2022 పరీక్షకు ఈ సారి 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా ఈఏడాది 18.72 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. రికార్డ్ స్థాయిలో 95 శాతం హాజరైనట్లు సమాచారం. అలాగే.. NEET 2022 Answer Key అధికారిక ఆన్సర్కీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక.. ప్రశ్నపత్రం విషయానికొస్తే.. గడచిన రెండేళ్లతో పోలిస్తే ఈసారి నీట్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా వచ్చినట్లు విద్యార్థులు, నిపుణులు చెబుతున్నారు. ప్రతీసారీ ఫిజిక్స్ కఠినంగా ఉంటే.. ఈ ఏడాది బయాలజీ, కెమిస్ట్రీలో టఫ్ క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు. ఈసారి ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయంటున్నారు.
వాస్తవానికి బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయని.. ఈసారి మాత్రం వీటిలో లాజికల్ క్వశ్చన్స్ ఇచ్చారని నిపుణులు వెల్లడించారు. అలాగే కొత్త మోడల్ ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. దీంతోపాటు గతంలో లేని విధంగా మ్యాచింగ్ టైప్ ప్రశ్నలతోపాటు స్టేట్మెంట్ - రీజన్ ప్రశ్నలను ఇచ్చినట్లు వెల్లడించారు. దాదాపు 10-12 ప్రశ్నలు కొత్త మోడల్లో ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు. బయాలజీలో ప్రశ్నలు చాలా పెద్దగా ఉన్నట్లు విద్యార్ధులు పేర్కొన్నారు. దానివల్ల సమయం సరిపోలేదని వాపోయారు.
125-130 మధ్యలో కటాఫ్ మార్క్:
గత ఏడాది 480కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈ ఏడాది 450పైగా మార్కులు సాధిస్తే సీటు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లలో పేపరు కొంచెం సులువుగా ఉండటం వల్ల మొత్తం 720 మార్కుల్లో.. 700 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు ఎక్కువమంది ఉన్నారు.
ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉండడంతో.. అన్ని మార్కులొచ్చేవారు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతేడాది(2021)లో కటాఫ్ మార్కు జనరల్లో 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.