ఎంసెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం 45శాతం మార్కులు వచ్చి ఉండాలి.
అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వం అందరినీ పాస్ మార్కులతో పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేసి.. ఫలితాలు వెల్లడించింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించి.. ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది.
ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్.. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.
కారణం ఇదే..!
ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. వీరిలో 1.75 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్కు అర్హత సాధించేవారు.
కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కుల (35)తో ఫెయిలైన వారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులంటరూ ఎంసెట్ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు.
అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వం అందరినీ పాస్ మార్కులతో పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేసి.. ఫలితాలు వెల్లడించింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించి.. ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది.
ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్.. ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.
కారణం ఇదే..!
ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. వీరిలో 1.75 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్కు అర్హత సాధించేవారు.
కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కుల (35)తో ఫెయిలైన వారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులంటరూ ఎంసెట్ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు.