యాప్నగరం

TS POLYCET 2020 దరఖాస్తు గడువు పొడిగింపు

పాలిసెట్-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్‌బీటీఈటీ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 25 Jul 2020, 9:18 pm
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్) -2020 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) నిర్ణయం తీసుకుంది. రూ.300 ఆలస్య రుసుముతో ఈనెల (జులై) 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఎస్‌బీటీఈటీ కార్యదర్శి యూవీఎస్‌ఎన్ మూర్తి ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu టీఎస్‌ పాలిసెట్‌ 2020


డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్లు పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మాత్రమే జరుపుతామని ఎప్పటి నుంచో విద్యాశాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెండేళ్ల అగ్రికల్చర్‌ డిప్లొమా, మూడేళ్ల అగ్రికల్చర్‌ డిప్లొమా ఇంజినీరింగ్‌ కోర్సులకు కూడా ఇక నుంచి పదో తరగతి మార్కులు లేదా గ్రేడ్లు కాకుండా పాలిసెట్‌ ర్యాంకును ప్రామాణికంగా తీసుకోనున్నారు.

పూర్తి వివరాలకు https://polycetts.nic.in/ లేదా https://www.sbtet.telangana.gov.in/ వైబ్‌సైట్‌ చూడవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.