యాప్నగరం

Hyderabad: హైదరాబాద్‌ అమ్మాయికి 2.7 కోట్ల స్కాలర్‌షిప్‌.. ఎందరో ప్రముఖులు చదివిన చరిత్ర ఉన్న కాలేజీలో సీటు.. ప్రశంసల వెల్లువ

2.7 crore Scholarship for Hyderabad Girl - Sriya Lakkapragada: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన శ్రియా లక్కాప్రగడ (18) పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో చదువుకుంది. ఆతర్వాత డెల్టా కాలేజ్‌లో ఇంటర్‌ చదువుకుంది. డిగ్రీ ఏకంగా దేశందాటి అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం కలిగింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 18 Jul 2022, 4:06 pm
US Wellesley College Scholarship 2022 for Hyderabad Girl - Sriya Lakkapragada: తెలంగాణ రాష్ట్ర విద్యార్ధిని శ్రియా లక్కాప్రగడ (Sriya Lakkapragada).. అమెరికా (America) అందించే స్కాలర్‌షిప్‌ (Scholarship) కు ఎంపికైంది. అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్‌షిప్‌తో పాటు సీటు సంపాదించింది. దాదాపు రూ. 2.7 కోట్ల స్కాలర్‌ఫిప్‌ ఆఫర్‌ తెలంగాణ రాష్ట్ర విద్యార్ధినికి దక్కింది.
Samayam Telugu Hyderabad Girl - Sriya Lakkapragada


వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన శ్రియా లక్కాప్రగడ (18) పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో చదువుకుంది. ఆతర్వాత డెల్టా కాలేజ్‌లో ఇంటర్‌ చదువుకుంది. డిగ్రీ ఏకంగా దేశందాటి అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం కలిగింది. శ్రీయాకు అమెరికా మసాచుసెట్స్‌లోని వెల్లెస్లీ కాలేజీ ఏకంగా 2.7 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది.

Prem Kumar: కూలీ కొడుక్కి రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్‌.. భారత్ నుంచి ఒకే ఒక్కడు.. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 6 మందిలో ఒకడు
ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, సైకాలజీ విభాగాల్లో 4 ఏళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ కూడా అందించనున్నట్లు ప్రకటించింది. వెల్లెస్లీ కాలేజీలో ఎందరో ప్రముఖులు చదివిన చరిత్ర ఉంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు హిల్లరీ క్లింటన్ కూడా ఇదే కాలేజీలో చదువుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ.. వెల్లస్లీ కాలేజీలో కంప్యూటర్‌సైన్స్‌ లేదా సైకాలజీలో డిగ్రీ చదివే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మాస్టర్స్‌ కూడా అమెరికాలో పూర్తి చేస్తానని వివరించారు. ఎంఎస్‌ పూర్తయ్యాక.. స్టార్ట్‌పను ప్రారంభిస్తానన్నారు. ఈ స్కాలర్‌షిప్‌ సాధించడంలో డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ వివేక్ సాగర్‌ తనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రోత్సహించారని, వారి సహకారంతోనే ఇదంతా సాధించినట్లు తెలిపింది.

Nelson Mandela International Day: జులై 18.. అంతర్జాతీయంగా చాలా ప్రముఖమైన రోజు.. ఎందుకంటే..?
సీఈఓ శరద్ వివేక్ సాగర్ మాట్లాడుతూ.. వంద మంది సరైన యువకులు ముందుకొస్తే తాను దేశ రాతనే మారుస్తానన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో గత 14 సంవత్సరాలుగా రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే లక్ష్యంగా తమ డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ పనిచేస్తోందన్నారు. శ్రీయా యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, తమ సంస్థ ఇచ్చిన శిక్షణతో ఇప్పటి వరకు ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని వెల్లడించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.