యాప్నగరం

9,355 పోస్టులు.. 5.69 లక్షల దరఖాస్తులు

తెలంగాణలో రాష్ట్రంలో ఆగస్టు 2న 4,383 కొత్త పంచాయతీలు ఆవిర్భవించాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఖాళీగా ఉన్న 9,355 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీచేయనున్నారు.

Samayam Telugu 16 Sep 2018, 1:33 pm
తెలంగాణలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం 5.69 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం (సెప్టెంబరు 15) చివరితేది కావడంతో.. భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,69,447 దరఖాస్తులు అందాయి. వీరికి అక్టోబరు 4న అన్ని జిల్లాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. జిల్లాలవారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను వేరుచేసిన తర్వాత పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
Samayam Telugu panchayat


తెలంగాణలో రాష్ట్రంలో ఆగస్టు 2న 4,383 కొత్త పంచాయతీలు ఆవిర్భవించాయి. దీంతో మొత్తం పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. వీటిలో 95 శాతం చిన్న పంచాయతీలే ఉన్నాయి. పల్లె వాసులకు స్థానిక పాలనను మరింత చేరువ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. గ్రామ పాలన కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.

కొత్తగా ఏర్పడిన పంచాయతీలను కలుపుకొని రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. వీటిని భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది.
Related Article: పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.