గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 115 జూనియర్ అసిస్టెంట్-కం-టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష(మెయిన్ ఎగ్జామ్)ను మే 31న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు మే 14న అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29న మెయిన్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పరీక్షను వాయిదా వేసింది. మే 31న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కోసం విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను కమిషన్ అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
APPSC ANGRAU Exam 2019: జూనియర్ అసిస్టెంట్ ప్రధాన పరీక్ష తేది ఖరారు
మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29న మెయిన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Samayam Telugu 15 May 2019, 2:18 pm
ప్రధానాంశాలు:
- మే 31న జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మెయిన్ పరీక్ష
- రెండు సెషన్లలో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ
- నాలుగు జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు