యాప్నగరం

1-10 తరగతుల సిలబస్‌ ఖ‌రారు.. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు..!

సిలబస్‌లోని అధ్యాయాలను తరగతి గదిలో బోధించాల్సినవి, ప్రాజెక్టు ఆధారితమైనవి అంటూ రెండుగా విభజించారు.

Samayam Telugu 29 Oct 2020, 4:06 pm
తెలంగాణాలో 1-10 తరగతుల సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. సిలబస్‌లోని అధ్యాయాలను తరగతి గదిలో బోధించాల్సినవి, ప్రాజెక్టు ఆధారితమైనవి అంటూ రెండుగా విభజించింది. ప్రాజెక్టు ఆధారిత అధ్యాయాలకు సంబంధించిన సిలబస్‌.. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్లు(ఎఫ్‌ఏ), సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ) లేదా బోర్డు పరీక్షలకు ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
Samayam Telugu సిలబస్‌ ఖరారు


కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై డీఈవోలు, ఆర్‌జేడీలు ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సిలబస్‌ తగ్గిస్తున్నట్లు ఆదేశాల్లో ఎక్కడా పేర్కొనలేదు. తరగతి గది బోధనకు సంబంధించి కొన్ని సబ్జెక్టుల్లో పాఠాలు పూర్తిగా తొలగించగా.. మరికొన్నింటిలో కొన్ని కాన్సెప్ట్‌లు మాత్రమే తొలగించారు.

Must read: పరీక్ష రాయకుండానే జేఈఈలో టాపర్‌.. కొడుకు కోసం ఓ డాక్టర్‌ చేసిన కుట్ర బట్టబయలు..!

పదో తరగతిలో సిలబస్‌:
గణితంలో 30 శాతం, భౌతికశాస్త్రంలో 27 శాతం, జీవశాస్త్రంలో 30 శాతం, సాంఘికశాస్త్రంలో 29 శాతం, ఇంగ్లిష్‌లో 25 శాతం ప్రాజెక్టు ఆధారిత సిలబస్‌లో చేర్చారు. అంటే వాటినుంచి పరీక్షల్లో ప్రశ్నలు రావు. ఏయే తరగతుల్లో ఏ అధ్యాయాలను ప్రాజెక్టుల కోసం కేటాయించారో పూర్తి వివరాలను https://www.scert.telangana.gov.in/ అనే వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.

Also read: యూపీఎస్సీ- సీడీఎస్ ఎగ్జామ్ (1) 2021 నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం ఇదే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.