యాప్నగరం

APPSC AO Recruitment 2019: అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

అభ్యర్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Samayam Telugu 10 Jan 2019, 11:10 am
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖలో అగ్రిక‌ల్చ‌రల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది జనవరి 29 కాగా.. జనవరి 28లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Samayam Telugu Telugu-image (1)

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
✦ ఫీజు చెల్లింపు చివ‌రితేది 28.01.2019.
✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది 29.01.2019.
✦ స్క్రీనింగ్ పరీక్ష తేది ప్రకటించాల్సి ఉంది.
✦ మెయిన్ పరీక్ష తేది 17.04.2019.
వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.