యాప్నగరం

AICTE కీలక ప్రకటన.. డిసెంబర్ 1 నుంచి ఫ్రెషర్లకు క్లాసులు ప్రారంభం..!

ఏఐసీటీఈ 2020-21కి గాను సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

Samayam Telugu 20 Oct 2020, 10:03 am
ఇంజనీరింగ్‌, ఇతర సాంకేతిక కోర్సుల్లో చేరే ఫస్టియర్‌ విద్యార్థులకు డిసెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఆల్టర్నేటివ్ అకడమిక్‌‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం (2020-21)కు సంబంధించి బీటెక్‌, బీఫార్మసీ ఫస్టియర్‌ తరగతులను దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ఏఐసీటీఈ యూనివర్సిటీలకు సూచించింది.
Samayam Telugu ఇంజనీరింగ్‌ క్లాసులు


అలాగే అడ్మిషన్ల ప్రక్రియను కూడా నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ను సవరించింది. గత ఆగస్టు 13న విడుదల చేసిన అకడమిక్‌ షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 1 నుంచి తరగతులు మొదలుపెట్టాలి. ఫస్టియర్‌ ప్రవేశాలను నవంబరు 15లోపు పూర్తి చేయాలి.

కానీ కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలకు తోడు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో ప్రవేశాలు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గడువును పెంచినట్లు ఏఐసీటీఈ పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం నవంబరు 30వ తేదీ వరకు ప్రవేశాలు జరుపుకోవచ్చు. అనంతరం డిసెంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభించాల్సి ఉంటుంది.

Must read: బీఈ/బీటెక్ వాళ్లకు బెల్ సంస్థలో 56 జాబ్స్.. రాత పరీక్ష లేదు..!

Also read: పాలిటెక్నిక్ అమ్మాయిలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం.. దరఖాస్తుకు ఈ నెల 21 ఆఖరు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.