యాప్నగరం

గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధం

ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్టు ఆ సంస్థ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.

TNN 23 Feb 2017, 8:35 pm
ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్టు ఆ సంస్థ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఫిబ్రవరి 26న జరిగే పరీక్ష కోసం మొత్తం అయిదు లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్టు ఆయన చెప్పారు. కేవలం ఏపీలోని జిల్లాల్లోనే కాకుండా... హైదరాబాద్ లో కూడా పరీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో 86 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షల రాయనున్నారని చెప్పారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు.
Samayam Telugu all set for group 2 exams says appsc chairman
గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధం


మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కోసం వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలు తెలపాలని లేఖలు రాసినట్టు చెప్పారు. ఆ వివరాలు కూడా వచ్చాక మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 982 పోస్టులకు గాను గ్రూప్ 2 పరీక్ష జరుగుతోంది. లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం పరీక్షకు హాజరవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.