యాప్నగరం

AP SSC Supplementary Exams 2022: ఏపీలో టెన్త్‌ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. పూర్తి వివరాలివే

AP 10th Class Betterment Exams: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అలాగే బెటర్‌మెంట్‌ రాసుకునే అవకాశం కల్పించింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 22 Jun 2022, 11:31 am
AP SSC Supplementary Exams 2022: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే.. వారికి ఫీజును వాపస్‌ చేయనున్నారు. ఫెయిల్‌ అయిన 2,01,627 మంది విద్యార్థులకూ హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులోఉంచుతామని పేర్కొన్నారు.
Samayam Telugu AP SSC Supplementary Exams 2022


AP SSC 2022 Betterment Exams Instructions: పదోతరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఈసారి బెటర్‌ మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు.

ఈమేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

అయితే.. ఫెయిల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో ఈ బెటర్‌ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఈ బెటర్‌ మెంట్‌ పరీక్షలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమతం అని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో సప్లమెంటరీ పరీక్షలను జులై 06 నుంచి జులై 15 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.