యాప్నగరం

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు.

TNN 13 Apr 2017, 3:53 pm
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. మంత్రి ఆదినారాయణతో కలసి విజయవాడలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో అన్ని విభాగాల్లోనూ బాలికలదే పైచేయి అని మంత్రి గంటా వెల్లడించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో ఉండగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో కృష్ణాలో అత్యధికంగా 77 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. నెల్లూరు 69 శాతంతో రెండో స్థానంలోనూ, మూడో స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచాయన్నారు. మే 15 అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిమని చెప్పారు.
Samayam Telugu andhra pradesh board intermediate 1st year results 2017
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు


ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్‌చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.