యాప్నగరం

ఏపీ ఇంటర్ సెకెండియర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు.

TNN 13 Apr 2017, 4:05 pm
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. మరో మంత్రి ఆదినారాయణతో కలసి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో ఉండగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని గంటా తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 86 శాతంతో కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 80 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు, చిత్తూరు రెండో స్థానంలో ఉన్నాయి. 79 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు మూడో స్థానంలో నిలిచింది. కాగా, మే 15 అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానం అమలు చేసే యోచన ఉందని మంత్రి గంటా వెల్లడించారు.
Samayam Telugu andhra pradesh board intermediate 2nd year results 2017
ఏపీ ఇంటర్ సెకెండియర్ ఫలితాలు


ఇంటర్ సెకెండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.