యాప్నగరం

AP: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఫస్టియర్‌ క్లాసుల ప్రారంభం వాయిదా..!

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం నుంచి మొదలు కావాల్సి ఉంది.

Samayam Telugu 16 Nov 2020, 10:48 am
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌. నేటి (నవంబర్ 16) నుంచి మొదలు కావాల్సిన ఇంటర్మీడియెట్ ఫస్టియర్ క్లాసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం నుంచి మొదలు కావాల్సి ఉంది.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు.
Samayam Telugu ఇంటర్‌ ఫస్టియర్‌ క్లాసులు


కాగా.. ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్య 88 నుంచి 40కి తగ్గించడంతో ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనితో ఆన్‌లైన్ ప్రవేశాల్లో కూడా జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే కేసు ఇంకా ఓ కొలిక్కి రానుందున ఇంటర్ బోర్డు మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే.. నవంబర్ 2 నుంచి ఏపీ వ్యాప్తంగా 9,10, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాగా.. ఈ నెల 23వ తేదీ నుంచి 6,7,8 తరగతులు, డిసెంబర్ 14 నుంచి 1 నుంచి 5 తరగతులు పున: ప్రారంభం కానున్నాయి.

Must read: ఎస్‌బీఐలో 2000 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ జాబ్స్‌.. పూర్తి వివరాలివే..!

Also read: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. వివరాలివే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.