యాప్నగరం

AP: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు‌ రద్దు.. గ్రేడింగ్‌పై యూనివర్సిటీలదే నిర్ణయం

డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేడింగ్‌ విషయంలో వర్సిటీలకే నిర్ణయం వదిలేసింది.

Samayam Telugu 24 Jun 2020, 10:43 am
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లాగానే డిగ్రీ, పీజీ,వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Samayam Telugu డిగ్రీ పీజీ పరీక్షలు


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని భావించిన జగన్ సర్కార్ పరీక్షలను రద్దు చేసింది. డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.

Must read: ఇంటర్ మార్కుల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ దరఖాస్తు గడువు పెంపు

చివరి సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్, ఇంటర్నల్ మార్కులపై యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కాగా, కరోనా కారణంగా ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి విదితమే.

ఇప్పటికే కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం... ఈ పరీక్షలు రాసిన, రాయలనుకుంటున్న విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Must read: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. కొత్త తేదీలు ఇవే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.