యాప్నగరం

AP Govt: ఏపీలో అన్నింటికీ జూన్‌ 15 ఆఖరి గడువు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అన్నీ ప్రవేశపరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రభుత్వం గడువును పొడిగించింది. లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు కేంద్రం పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 19 May 2020, 7:17 pm
ఏపీలో త్వరలో జరగనున్న అన్నీ ప్రవేశపరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రభుత్వం గడువును పొడిగించింది. లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కేంద్రం పొడిగించిన నేపథ్యంలో ఏపీలో ఎంసెట్ తో సహా ఈసెట్‌, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి జూన్ 15వరకు పొడిగించింది.
Samayam Telugu ఏపీ ప్రభుత్వం


గతంలో పొడిగించిన గడువు బుధవారం ముగియనుండటంతో.. మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎటువంటి అదనపు ఫీజు లేకుండా జూన్ 15 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.