'సచివాలయ' ఉద్యోగాల మెరిట్ జాబితా ఎప్పుడంటే?
Andhra Pradesh Grama Sachivalayam Results 2019 | గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు.
Samayam Telugu 10 Sep 2019, 7:55 am
ప్రధానాంశాలు:
- పూర్తికావచ్చిన OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ
- సెప్టెంబరు 18న అభ్యర్థుల మెరిట్ జాబితా
- మెరిట్ ప్రకారమే నియామకాలు
- మీడియా సమావేశంలో వెల్లడించిన ఉన్నతాధికారులు
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబరు 18న విడుదల చేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 9న నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ పరీక్షలకు సంబధించిన అభ్యర్థులు OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ త్వరలోనే ముగియనుందని.. ఇప్పటికే 21 లక్షల షీట్లను స్కానింగ్ చేసినట్లు వారు వెల్లడించారు. సెప్టెంబరు 18న మెరిట్ జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: గ్రామ 'సచివాలయ' ఫలితాలు ఎప్పుడంటే?
అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని.. పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు తెలిపారు. నియామకాలు పూర్తయిన తర్వాత మిగిలిన పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
Read Also: UGC NET (Dec.)-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Read Also: గ్రామ 'సచివాలయ' ఫలితాలు ఎప్పుడంటే?
అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని.. పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు తెలిపారు. నియామకాలు పూర్తయిన తర్వాత మిగిలిన పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
Read Also: UGC NET (Dec.)-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం