యాప్నగరం

High Court Orders: 'గ్రూప్-1' ఫలితాలకు హైకోర్టు బ్రేక్

APPSC Group1 Recruitment 2019 | గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌లో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Samayam Telugu 1 Oct 2019, 8:23 am
'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల నిరీక్షణను హైకోర్టు మరింత పెంచింది. గ్రూప్-1 ఫలితాలను వెల్లడించవద్దని సెప్టెంబరు 30న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(ఏపీపీఎస్సీ)కు ఆదేశాలు జారీచేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబరు 30న విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజని ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు.
Samayam Telugu High-Court


RRB NTPC 'స్టేజ్-1' పరీక్ష, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

గతేడాది డిసెంబరులో మొత్తం 169 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష సమయంలో క్యాలిక్యులేటర్లు అనుమతిస్తామని పేర్కొన్నారు. కానీ.. పరీక్షకు క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని.. తెలుగు అనువాదంలో 74 తప్పులు దొర్లాయంటూ 15 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

IBPS PO ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయి.. పరీక్షలు ఎప్పుడంటే?

'గ్రూప్-1' పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రజని 'గ్రూప్-1' పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు ఆన్సర్ 'కీ' తప్పిదాల కారణంగా DAO పరీక్షకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.