APPSC: పంచాయతీ కార్యదర్శి ఫైనల్ 'కీ' విడుదల
Panchayat Secretary Recruitment 2019 | పంచాయతీ కార్యదర్శి మెయిన్ పరీక్షకు సంబంధించి రివైజ్డ్ కీపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫైనల్ కీని విడుదల చేసింది.
Samayam Telugu 22 Jan 2020, 4:56 pm
ఏపీలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) తుది ఆన్సర్ 'కీ'ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. జనరల్ స్డడీస్ & మెంటల్ ఎబిలిటీ, గ్రామీణాభివృద్ధి-గ్రామీణ సమస్యలు పేపర్లకు సంబంధించిన ప్రశ్నపత్రంతోపాటు.. ఆన్సర్ 'కీ'లను వెబ్సైట్లో పొందుపరిచింది. పంచాయతీ కార్యదర్శి మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలకు చూసుకోవచ్చు. రివైజ్డ్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని విడుదల చేశారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
ఏపీలో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 19 నుంచి జనవరి 29 వరకు దరఖాస్తు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 4,95,526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,94,966 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జులై 19న ఫలితాలను విడుదల చేయగా 14,175 మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.
Read Also: NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 26న మెయిన్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్కు అర్హత సాధించిన మొత్తం 14,175 అభ్యర్థుల్లో 13,695 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 480 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారిలో మొత్తం 12,984 ( 94.8 శాతం) మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. 711 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హజరయ్యారు.
Read Also: వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు.. జీతమెంతో తెలుసా?
మెయిన్ పరీక్ష ప్రాథమిక కీని సెప్టెంబరు 4న, మొదటి రివైజ్డ్ కీని అక్టోబరు 29న, రెండో రివైజ్డ్ కీని నవంబరు 27న విడుదల చేయగా.. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది కీని జనవరి 21న విడుదల చేసింది.
వెబ్సైట్
Read More:
➦ మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
➦ మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .
- Paper-I : GENERAL STUDIES AND MENTAL ABILITY
- Paper-II : Rural Development and Problems in Rural Areas
ఏపీలో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 19 నుంచి జనవరి 29 వరకు దరఖాస్తు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 4,95,526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,94,966 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జులై 19న ఫలితాలను విడుదల చేయగా 14,175 మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.
Read Also: NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 26న మెయిన్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్కు అర్హత సాధించిన మొత్తం 14,175 అభ్యర్థుల్లో 13,695 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 480 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారిలో మొత్తం 12,984 ( 94.8 శాతం) మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. 711 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హజరయ్యారు.
Read Also: వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు.. జీతమెంతో తెలుసా?
మెయిన్ పరీక్ష ప్రాథమిక కీని సెప్టెంబరు 4న, మొదటి రివైజ్డ్ కీని అక్టోబరు 29న, రెండో రివైజ్డ్ కీని నవంబరు 27న విడుదల చేయగా.. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది కీని జనవరి 21న విడుదల చేసింది.
వెబ్సైట్
Read More:
➦ మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
➦ మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .