యాప్నగరం

AP 10th Results 2018: క్లిక్ చేసి టెన్త్ ఫలితాలు చూస్కోండి!

ఏపీలో పదోతరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సాయంత్రం 4: 00 గం. విశాఖపట్నం నుంచి ఫలితాలను విడుదల చేశారు.

Samayam Telugu 29 Apr 2018, 5:27 pm
ఏపీలో పదోతరగతి ఫలితాలు ఆదివారం (ఏప్రిల్ 29) విడుదల కానున్నాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం నుంచి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి 29 వరకు జరిగిన పదోతరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,17,484 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం 2,834 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు..
Samayam Telugu results


పది ఫలితాలు సాయంత్రానికి వాయిదా.. మెసేజ్ రూపంలో రిజల్ట్స్ కోసం రిజిస్టర్ చేస్కోండి..

టెన్త్ ఫలితాల సరళి, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


టీవీ స్క్రీన్‌ పైనే ఫలితాలు..

ఫైబర్‌నెట్ కనెక్షన్‌ ఉన్న వినియోగదారుల ఇళ్లలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను వారి ఆధార్‌ నెంబర్‌ ద్వారా సేకరించి వారి ఫలితాలను ఆ టీవీ తెరపై హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌ టైప్‌ చేయకుండానే ఆటోమేటిక్‌గా ఫలితాలు ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ వెబ్‌సైట్‌లో, పీపుల్స్‌ ఫస్ట్‌ మొబైల్‌ యాప్‌, సీఎం కనెక్ట్‌ ఖైజాలా యాప్‌లోనూ ఫలితాలు విడుదల చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.