యాప్నగరం

AP: విద్యార్థులకు శుభవార్త.. వసతి దీవెన, విద్యా దీవెన పొందలేని వారికి మరో అవకాశం..!

జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలను పొందలేని విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

Samayam Telugu 24 Jun 2020, 4:11 pm
కరోనా కష్ట కాలంలో ఏపీ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలకు అర్హులైనా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లబ్ది పొందలేని విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
Samayam Telugu ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం


చిన్న చిన్న కారణాలతో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు పొందని వారు వెంటనే గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసి వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ పథకాలకు ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

Must read: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు.. గ్రేడింగ్‌పై యూనివర్సిటీలదే నిర్ణయం

అయితే జగనన్న వసతి దీవెన కింద విద్యార్ధులకు ప్రతీ ఏటా రూ.20వేలను ప్రభుత్వం అందిస్తోంది. వసతి, భోజనం ఖర్చుల నిమిత్తం డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా ఈ డబ్బును వారి తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్నారు.

ఇక జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులకు సంబంధించిన పూర్తి కాలేజీ ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది విద్యార్థులు చిన్న చిన్న కారణాలతో ఈ పథకాలను పొందలేకపోయారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో అలాంటి వారికి మరో అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Must read: ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.