యాప్నగరం

Ammavodi: కొద్దిసేపట్లో అమ్మ ఒడి పథకం ప్రారంభించనున్న సీఎం జగన్‌.. 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ

Nimmagadda ramesh kumar: అమ్మఒడి కార్యక్రమంలో ఎన్నికల కోడ్ పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సర్క్యులర్ జారీ చేసింది.

Samayam Telugu 11 Jan 2021, 10:50 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ నవరత్నాల హమీలో భాగంగా అమ్మఒడికి వరుసగా రెండో ఏడాది కూడా శ్రీకారం చుడుతున్నారు. ఈ రోజు నెల్లూరులో ‘అమ్మఒడి’ పథకం రెండో విడత చెల్లింపులు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు పయనం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శిస్తారు.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి పథకం


అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో జగనన్న అమ్మఒడి పథకం నిధులు అందుతాయా? లేదా అనే సందేహం కొందరిలో నెలకొంది.

జనవరి 18 నుంచి రెండు పూటలా క్లాసులు..!
ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఓ ప్రకటన చేశారు. ‘అమ్మ ఒడి పథకం యథాతథంగా అమలు చేస్తాం. ఇప్పటికే జీవో నెంబర్ 3 విడుదల చేశాం. 44,08,921 మందికి అమ్మ ఒడి వర్తిస్తుంది. రూ.6,612 కోట్లతో అమ్మ ఒడి అమలు చేసి తీరతాం. సోమవారం (జనవరి 11) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతా ల్లో డబ్బు జమ చేస్తారు. అమ్మఒడిని ఆపే ప్రసక్తే లేదు.’ అని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా, అనంతరం ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు. మొత్తంగా గతేడాది జనవరి 9న దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు.

నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి
ఇదిలావుంటే, ‘అమ్మఒడి’ కార్యక్రమంలో ఎన్నికల కోడ్ పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సర్క్యులర్ జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘అమ్మఒడి’ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే పాల్గొనాలని, పట్టణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొనవచ్చని ఉత్తర్వుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

‘అమ్మఒడి’ గతంలోనే ప్రారంభించిన పథకమైనందున యథావిధిగా అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని స్పష్టంచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.