యాప్నగరం

AP EAMCET Results 2022: ఈరోజే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

Manabadi AP EAMCET Results: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు జులై 26న విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 26 Jul 2022, 7:47 am
AP EAMCET Results 2022: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ ఫలితాలు (AP EAPCET Results) జులై 26న విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విజ‌య‌వాడ‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే.
Samayam Telugu AP EAMCET Results 2022


AP EAMCET Answer Key 2022: ఏపీ ఎంసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల:
AP EAPCET 2022 Answer Key: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ ఆన్సర్‌ కీ మంగళవారం (జులై 12) విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2022) ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ (Engineering) పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ (agriculture), ఫార్మసీ (Pharmacy) పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో AP EAPCET 2022లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.